loader

తిలక్ వర్మ ఒంటరి పోరాటం వృథా! రెండో టీ20లో చిత్తుగా ఓడిన భారత జట్టు…

రెండో టెస్టులో టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుని.. ఛేదనలో ఓడింది. 214 పరుగుల భారీ లక్ష్యఛేదనలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా, 19.1 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది భారత జట్టు.. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ 8 బంతుల్లో 2 సిక్సర్లతో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆదుకుంటాడని అనుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ […]

టీమిండియా ముందు 214 పరుగుల భారీ టార్గెట్ పెట్టిన సౌతాఫ్రికా… 90 పరుగులు చేసి రనౌట్ అయిన క్వింటన్ డి కాక్..

ముల్లాన్‌పూర్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది.46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, సెంచరీని మిస్ చేసుకున్నాడు. 90 పరుగుల వద్ద రనౌట్ అయ్యి, పెవిలియన్ […]

7 వైడ్లు, 13 బాల్స్! పరమ చెత్త రికార్డు క్రియేట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్…

సౌతాఫ్రికాతో రెండో టీ20లో భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఓవర్ మొదటి బంతికి క్వింటన్ డి కాక్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత వరుసగా రెండు వైడ్లు వేసిన అర్ష్‌దీప్ సింగ్, రెండో బంతికి పరుగులేమీ ఇవ్వలేదు. ఆ తర్వాత ఏకంగా నాలుగు వైడ్లు వేశాడు. ఇలా ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో 7 వైడ్స్, 13 బాల్స్ వేసి… 18 పరుగులు సమర్పించిన అర్ష్‌దీప్ సింగ్.. టీ20ల్లో సుదీర్ఘ ఓవర్ వేసిన […]

హైదరాబాద్‌లో మెస్సీ.. అభిమానులకు ఫోటో ఛాన్స్… కానీ ధర వింటే ఆశ్చర్యమే!

అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో నగరంలో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ సందర్శనలో భాగంగా అభిమానులకు ఆయనతో ఫోటో దిగే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అయితే ఈ ప్రత్యేక అవకాశం కోసం కట్టాల్సిన మొత్తం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక ఫోటో కోసం రూ. 9.95 లక్షలు + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని “ద గోట్ టూర్” నిర్వహణ కమిటీకి చెందిన సలహాదారు పార్వతి రెడ్డి వివరించారు.

టీమ్‌లోకి రావాలంటే రూ.1.2 లక్షల డీల్.. బీసీసీఐ కళ్ల ముందే భారీ స్కామ్

పుదుచ్చేరిలో క్రికెట్ టీమ్‌లలోకి రావడానికి ఆటగాళ్లు షార్ట్‌కట్ ఎంచుకుంటున్నారు. కొంతమంది వ్యక్తులు బీసీసీఐ, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ పుదుచ్చేరికి పనిచేస్తూ, డబ్బు తీసుకుని ఫేక్ అడ్రస్‎లు క్రియేట్ చేయడం, అర్హత ధృవీకరణ పత్రాలను అందిస్తున్నారు. బీసీసీఐ అండర్లోనే జరుగుతున్న ఈ అక్రమాన్ని ప్రముఖ మీడియా దర్యాప్తులో బయటపడింది. నివాస అవసరాన్ని ఇలా నకిలీ పత్రాలతో పూర్తి చేయించి, ఆ ఆటగాళ్లను స్థానిక ఆటగాళ్లుగా మారుస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ ప్యాకేజ్ రూపంలో రూ.1.2 లక్షలు లేదా అంతకంటే […]

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో సీఎం రేవంత్. ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ సీజన్-2 ప్రారంభం

ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) సీజన్-2 ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎమ్‌సి బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ అంతర్జాతీయ మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బాలీవుడ్ సూపర్‌స్టార్, లీగ్ బ్రాండ్ అంబాసిడర్ సల్మాన్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్రాంచైజీ-ఆధారిత సూపర్‌క్రాస్ లీగ్‌గా ISRL గుర్తింపు పొందింది. ఈ లీగ్‌లో 20 కంటే ఎక్కువ దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ రైడర్లు పోటీ […]

హిట్‌మ్యాన్ దర్బార్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 రన్స్ పూర్తి..

భారత జట్టుకు చెందిన పవర్ హిట్టింగ్ బ్యాట్స్‌మెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన మూడవ వన్డే మ్యాచ్‌లో, తన ఇన్నింగ్స్‌లో 27వ పరుగును పూర్తి చేయడం ద్వారా ఆయన 20,000 అంతర్జాతీయ పరుగుల మార్కును అధిగమించారు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే 14వ ఆటగాడిగా, నాల్గవ భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. 

ఎట్టకేలకు టాస్ గెలిచిన భారత్

భారత్ -సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. వాషింగ్టన్ సుందర్ కు బదులుగా టీమ్ లోని తిలక్ వర్మను తీసుకున్నారు. 20 మ్యాచ్ లు తరువాత టీమిండియా టాస్ గెలిచింది. భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ,  రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కెఎల్ రాహుల్ (కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్,  అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ

గిరిజన గ్రామం నుంచి ప్రపంచకప్ వేదిక వరకు.. అంధ క్రికెటర్ కరుణ కుమారికి ఘన స్వాగతం..!

 శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన తొలి మహిళా   అంధుల టీ-20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయకేతనం  ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించింది కరుణ కుమారి.  ఈ గిరిజన యువతికి విశాఖలో ఘన స్వాగతం లభించింది.  తోటి అంధ విద్యార్థులతో కలిసి ఆమె భారీ  విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కరుణకు శాలువాతో  ఘనంగా సత్కరించి, లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేశారు.

పోలీస్ బాస్‌గా టీమిండియా స్టార్.. సిలిగురి ఏసీపీగా నియామకం..!

వరల్డ్ ఛాంపియన్ రీచా ఘోష్‌కు ఇచ్చిన మాటను బెంగాల్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. విశ్వ విజేతగా  తిరిగొచ్చిన రీచాకు డీఎస్పీ (DSP) హోదాను కట్టబెట్టింది. యావత్ దేశం, రాష్ట్రం గర్వించేలా చేసిన టీమిండియా స్టార్‌ను సిలిగురి ఏసీపీ (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా)గా నియమించారు. బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ సమక్షంలో గురువారం రీచా బాధ్యతలు స్వీకరించింది. ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంలో కీలకమైన రీచాకు స్వరాష్ట్రం బెంగాల్‌లో ఘన స్వాగతంతో పాటు ఊహించని పదవి దక్కింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON