loader

మాజీమంత్రి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై కోవూరు పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మాజీమంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై సెక్షన్ 74, 75, 79, 296 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీమంత్రి ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జగన్కాన్వాయ్ దిగకుండా అడ్డుకున్న చిత్తూరు ఎస్పీ

చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంగాళరుపాళ్యానికి వెళ్లారు. చంద్రగిరి యువజన విభాగం కార్యదర్శిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జ్ లో యువజన విభాగం కార్యదర్శి శశిధర్ రెడ్డి తలకు గాయమైందని ఆరోపించారు. గాయపడ్డ కార్యకర్త దగ్గరికి వెళ్లేందుకు జగన్ ప్రయత్నం చేయగా.. చిత్తూరు ఎస్పీ మణికంఠ తిరిగి కాన్వాయ్‍లో జగన్‍ను ఎక్కించి, అక్కడి నుంచి […]

రాహుల్ గాంధీకి అభినంద‌న‌లు.. కేటీఆర్ వ్యంగాస్త్రాలు

బుల్డోజ‌ర్ల పాల‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. తెలంగాణ‌కు బుల్డోజ‌ర్ రాజ్ తీసుకొచ్చినందుకు రాహుల్ గాంధీకి అభినంద‌న‌లు అంటూ సెటైర్లు వేశారు. పేద‌ల‌ను మాత్ర‌మే ల‌క్ష్యంగా చేసుకుంటున్న బుల్డోజ‌ర్ రాజ్. బుల్డోజ‌ర్ల‌కు ధ‌నిక‌, కాంగ్రెస్ నాయ‌కుల అడ్ర‌స్ తెలియ‌దేమోన‌ని కేటీఆర్ ఎద్దెవా చేశారు.

డీకేను సీఎం చేయాల్సిందే.. కర్ణాటకలో మళ్లీ రచ్చ రచ్చ

కన్నడనాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పైకి అంతా బాగానే ఉన్నట్లు నటిస్తున్నా.. సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎంగా పరిస్థితి సాగతుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ సీఎం కావాలని అంటున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనకే మద్ధతుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు డీకే.. నాయకత్వం మార్పు ఏమి ఉండదని తొలుత వ్యాఖ్యానించి.. తాజాగా సీఎం కావాలనే ఆశ ఎవరికి ఉండదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

మా అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో: జగ్గారెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తమ సుదీర్ఘ రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో అని, ఆయన ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చర్చకు పిలిచే స్థాయి కేటీఆర్‌కు లేదని అన్నారు. మేమంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి క్షేత్రస్థాయి నుంచి నాయకులుగా ఎదిగాం. కేటీఆర్ తన తండ్రి సీటిస్తే నేరుగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయనెప్పుడైనా సర్పంచ్‌గా గెలిచారా? జడ్పీటీసీగా గెలిచారా? […]

డిప్యూటీ సీఎం పవన్‌పై అభ్యంతకర పోస్టులు..కేసు నమోదు

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు వైసీపీ సమన్వయకర్త కృపాలక్ష్మిపై కేసు నమోదయిది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులపై జనసేన ఫిర్యాదులు చేసింది. మాజీ సీఎం జగన్, పవన్ కళ్యాణ్ ఫోటోలతో అసభ్యకర కామెంట్  చేసిన పోస్ట్ కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై స్పందించిన కృపాలక్ష్మి తనకు సంబంధం లేదని వివరణ ఇస్తోంది. తన పేరుపై ఫేక్ ఐడి క్రియేట్ చేశారని ఆరోపిస్తోంది. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులు […]

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్

త్వరలోనే జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు నేతలు తాయిలాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వరాల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం సంచలన ప్రకటనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలోని అన్ని వర్గాల్లోని మహిళలకు ఏకంగా 35 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. బీహార్ శాశ్వత నివాసితులుగా ఉన్న మహిళలకు అన్ని రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో అన్ని వర్గాలు, స్థాయిలు, రకాల పోస్టులకు ప్రత్యక్ష నియామకాలలో ఈ రిజర్వేషన్‌ వర్తిస్తుందని […]

చర్చకు రాకుండా మాట తప్పడం,రచ్చ చేయడం రేవంత్ రెడ్డికి అలవాటే- కేటీఆర్

18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల రైతులు, కోట్లాది ప్రజలను నోటికొచ్చిన హామీలతో మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని కేటీఆర్ ఆరోపించారు. మొత్తం 420 హామీలిచ్చి, రచ్చ చేశారు కానీ చర్చకు రమ్మంటే పరార్ అవుతారని సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఆ సవాల్ స్వీకరించడంతో పాటు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం 11 గంటలకు చర్చకు రావాలని సూచించాం. మాట మీద నిలబడని నేత రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలి: షర్మిల

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారంటూ కొనియాడారు. వైఎస్సార్ జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో ఓ స్మృతివనం ఏర్పాటు చేయాలని షర్మిల కోరారు. ఇది వైఎస్సార్ అభిమానులు, ప్రజల పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి తన విజ్ఞప్తన్నారు.

ఇడుపులపాయలో వైఎస్సార్‌కు జగన్ నివాళులు

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌ తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా ఇడుపుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సతీమణి విజయమ్మ, వైఎస్‌ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు. తండ్రిని తలచుకుని మిస్ యూ నాన్న అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON