loader

రాజగోపాల్ రెడ్డి వినకపోతే వేటు తప్పదు- మల్లు రవి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పీసీసీ చీఫ్ తమ దృష్టికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు. పార్టీ నిబంధనలను పాటించకపోతే ఆయనపై వేటు తప్పదని మల్లు రవి స్పష్టం చేశారు. పార్టీలో అందరినీ సమన్వయం చేసుకుంటూ, విభేదాలను సరిదిద్దుతూ, అందరూ కలిసి పనిచేసేలా చూసే బాధ్యత తనదేనని మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, దానిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి […]

రాజ్యాంగాన్ని నిర్మూలించాలని బీజేపీ-ఆర్‌ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయి.. రాహుల్ గాంధీ విమర్శ

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీహార్ లోని ససరాం నుంచి “ఓటర్ అధికార్ యాత్ర” ను ప్రారంభించారు. బీహార్‌లో ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో ఈ యాత్రను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఓటర్ అధికార్ యాత్రను మొదలుపెట్టినట్టు తెలిపారు. బీజేపీ-ఆర్‌ఎస్ఎస్ కలిసి రాజ్యాంగాన్ని నిర్మూలిద్దామని చూస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టినట్టుగా ఆడియో వైరల్… టీడీపీ ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడించిన ఫ్యాన్స్

జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టినట్టుగా ఆడియో వైరల్‌గా మారడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దగ్గుబాటి ప్రసాద్ బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు అక్కడి ఫ్లెక్సీలను చించివేశారు. పరిస్థితి చేజారకుండా పోలీసులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అడ్డుకున్నారు.

ఆడియో లీక్‌ వివాదం.. ఎన్టీఆర్‌ అభిమానులకు క్షమాపణలు చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే

సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్న‌ ఆడియో త‌న‌ది కాద‌ని. రాజకీయాల్లో భాగంగా నాపై గిట్టనివాళ్లు ఈ వీడియో క్రియేట్ చేసి పెట్టార‌ని ఆయన స్పష్టం చేశారు. తనకు నారా, నందమూరి కుటుంబాలపై చిన్నప్పటి నుంచి అపారమైన గౌరవం ఉందని, వారి అభిమానినని తెలిపారు. ఈ ఆడియో వల‌న‌ నందమూరి, ఎన్టీఆర్‌ అభిమానులు ఎవరైనా బాధపడి ఉంటే, తన తరపున క్షమాపణలు కోరుతున్నట్లు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వీడియోలో చెప్పుకోచ్చాడు.

జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ ఎమ్మెల్యేదే అంటూ ఆడియో వైరల్

జూనియర్ ఎన్టీఆర్‌‌‌పై పరుష పదజాలంతో మాట్లాడుతోన్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యేది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. తనను స్పెషల్ షోకు ఆహ్వానించిన అభిమానితో బూతులు మాట్లాడుతున్న వ్యక్తి.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌పై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేయడం ఆడియోలో వినిపిస్తోంది. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వను.. సినిమాను ప్రదర్శిస్తే మధ్యలోనే కాల్చేస్తా.. ఆడించుకోండి చూద్దాం’’ అంటూ అతడికి హెచ్చరించడం ఆడియాలో […]

కుర్చీ వివాదంపై రియాక్ట్ అయిన కడప ఎమ్మెల్యే మాధవి

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ప్రోటోకాల్ వివాదం వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించారు. శుక్రవారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి తాను అధికారుల ఆహ్వానం మేరకు హాజరైనట్లు తెలిపారు. అయితే, తనకు కేటాయించిన ప్రదేశంలో అప్పటికే కొంతమంది అతిథులు కూర్చుని ఉన్నారని, వారు అక్కడి అధికారుల కుటుంబ సభ్యులేనని ఆమె గుర్తించారు. వారిని అక్కడి నుంచి లేపి తాను కూర్చోవడం సంస్కారం కాదని భావించి, కార్యక్రమం పూర్తయ్యే వరకు […]

రేపటి నుంచి రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభం

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో జరుగుతున్న “ఓట్ల చోరీ”కి వ్యతిరేకంగా ఒక భారీ యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ యాత్రకు “ఓటర్ అధికార్ యాత్ర” అని పేరు పెట్టారు. ఇది 16 రోజుల్లో సుమారు 1300 కిలోమీటర్లు కొనసాగుతుంది. ఈ యాత్ర రేపు బిహార్‌లోని ససారాంలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వివిధ జిల్లాలు, గ్రామాలు, నగరాల గుండా సాగి, సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే ఒక భారీ ర్యాలీతో ముగుస్తుంది.

కేసీఆర్ కారణజన్ముడు.. త్వరలోనే ఆయనపై పుస్తకం రాస్తా

తెలంగాణ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ, “కేసీఆర్ ఒక కారణజన్ముడు. ఆయన జీవితమే ఒక చరిత్ర. త్వరలోనే ఆయన్ని కేంద్రంగా చేసుకొని నేను కూడా ఒక పుస్తకం రాస్తాను” అని వెల్లడించారు. తాజాగా తెలంగాణ భవన్‌లో ‘ప్రజాయోధుడు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహేంద్ర తోటకూరి రచించిన ఈ పుస్తకం పూర్తిగా కేసీఆర్ జీవితానికి అంకితమైంది “ఈ పుస్తకం చాలా బాగుంది, చదివిన ప్రతి ఒక్కరికీ కేసీఆర్ జీవితం ఒక ప్రేరణగా నిలుస్తుంది” అని ఆయన ప్రశంసించారు.

పైసలూ మీకే.. పదవులూ మీకేనా? సీఎం రేవంత్‌పై కోమటిరెడ్డి ఫైర్

తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్‌పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, భవనాల నిర్మాణాల కోసం ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని మంత్రిని వందసార్లు కలిసినా ఫలితం లేకపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించక తప్పదన్నారు. ‘‘పదవులు మీరే తీసుకుంటున్నారు.. నిధులు కూడా మీరే తీసుకుంటున్నారని అడగాలా వద్దా?’’ తాను ముఖ్యమంత్రిని కానీ, పార్టీని కానీ విమర్శించడం లేదని, మునుగోడు నియోజకవర్గానికి నిధులు రావడం లేదనే ఆవేదనతోనే ఈ వ్యాఖ్యలు […]

రజినీకాంత్ ‘కూలీ’ విజయ విహారం.. ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన మోదీ

రజినీకాంత్ సినీ కెరీర్‌కు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ‘కూలీ’ రిలీజ్ కావడం, అది ఘనవిజయం సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ, “చలనచిత్ర ప్రపంచంలో 50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజినీకాంత్‌గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన పాత్రలు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసాయి. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను,” అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON