కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీహార్ లోని ససరాం నుంచి “ఓటర్ అధికార్ యాత్ర” ను ప్రారంభించారు. బీహార్లో ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో ఈ యాత్రను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఓటర్ అధికార్ యాత్రను మొదలుపెట్టినట్టు తెలిపారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి రాజ్యాంగాన్ని నిర్మూలిద్దామని చూస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

