loader

ఫోర్బ్స్ కుబేరుల జాబితా… దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ

భారత్‌లోని 100 మంది సంపన్నుల ఫోర్బ్స్ జాబితాలో ముకేశ్‌ అంబానీ మొదటి స్థానం సొంతం చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తర్వాత 92 బిలియన్‌ డాలర్లతో గౌతమ్ ఆదానీ రెండో స్థానంలో ఉన్నారు. ఓపీ జిందాల్‌కు చెందిన సావిత్రి జిందాల్ 40 బిలియన్‌ డాలర్లతో మూడోస్థానంలో, టెలికా దిగ్గజం సునీల్‌ మిట్టల్‌ 34 బిలియన్‌ డాలర్లతో నాలుగో స్థానంలో, టెక్‌ బిలియనీర్‌ శివ నాడార్‌ 33 బిలియన్‌ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచారు.

ఏపీలో 4 బ్యాంకులు విలీనం.. 5 రోజులు బ్యాంక్ సేవలు బంద్.. కస్టమర్లకు అలర్ట్

కొద్ది రోజుల కిందట.. ఆర్బీఐ గ్రామీణ బ్యాంకుల విలీనం గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని 4 గ్రామీణ బ్యాంకులు.. ఒకే బ్యాంకింగ్ గ్రూప్‌గా ఏర్పాటు కానున్నాయి. దీంతో 4 బ్యాంకులు ఇక మీదట కనిపించవు. విలీన ప్రక్రియలో భాగంగా.. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అనుసంధానంలో భాగంగా.. సాంకేతిక కారణాలతో.. దాదాపు 5 రోజుల పాటు చాలా వరకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటన విడుదల చేసింది.

రెండుగా విడిపోతున్న టాటా కంపెనీ.. మరో 5 రోజులే.. వరుసగా పడుతున్న షేర్ ధర

టాటా మోటార్స్ ఇప్పుడు రెండుగా విడిపోతుంది. టాటా మోటార్స్ నుంచి కమర్షియల్ వెహికిల్స్ (CV) బిజినెస్ విభజన చెంది.. కొత్త సంస్థగా అవతరిస్తోంది. ఇది టీఎంఎల్ కమర్షియల్ వెహికిల్స్ లిమిటెడ్‌గా (TMLCV) ఉంటుంది. టాటా గ్రూప్ సంస్థకు చెందిన టాటా మోటార్స్ షేర్ నాలుగో సెషన్‌లో పతనమైంది. ఇవాళ దాదాపు 2 శాతం వరకు పడిపోయింది. ప్రస్తుతం 1.50 శాతం నష్టంతో రూ. 687 స్థాయిలో ఉంది.

త్వరలోనే ఇండియాలో డిజిటల్ రూపీ ..

భారత్ తీసుకురాబోయే డిజిటల్ కరెన్సీని ‘డిజిటల్​ రూపీ’ అంటారు. కేంద్ర రిజర్వ్ బ్యాంక ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ఇది ఫిజికల్ కరెన్సీతో సమానంగా వర్తిస్తుంది. ఈ కరెన్సీతో ప్రపంచ వాణిజ్యం జరుపుతారు. భారత ఎకానమీని బట్టి దీని వాల్యూపెరగడం తగ్గడం ఉంటుంది. కాబట్టి డిజిటల్ కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లు ఇకపై డిజిటల్ రూపీపైనే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది కాకుండా మరే ఇతర క్రిప్టో కరెన్సీ ఉపయోగించినా లాభాల్లో 30శాతం పన్ను విధిస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం […]

వాట్సప్‌నకు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ ‘అరట్టై’ డౌన్‌లోడ్స్ 75 లక్షలు

ప్రముఖ మెసెంజర్ యాప్‌నకు పోటీగా వచ్చిన “అరట్టై” యాప్‌నకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. లాంఛ్ అయిన కొద్ది రోజుల్లోనే ఏకంగా 75 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. జోహో కంపెనీ రూపొందించిన ఈ యాప్‌ను కేంద్ర మంత్రితో పాటు పలువురు ప్రముఖులు ప్రమోట్ చేశారు. స్వదేశీ యాప్ అరట్టై ను వాడాలని పిలుపునిచ్చారు. కంపెనీ వివరాల ప్రకారం, అక్టోబర్ 3, 2025 నాటికి గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లో కలిపి అరట్టై యాప్‌ను 75 లక్షల […]

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు బిగ్ షాక్.. COD రుసుములపై కేంద్రం విచారణ

భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్ రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలు అయిన అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ పై దృష్టి సారించింది. ముఖ్యంగా, ఈ ప్లాట్‌ఫారమ్‌లు క్యాష్ ఆన్ డెలివరీ (COD) కోసం వసూలు చేస్తున్న అదనపు రుసుములు, అలాగే ముందస్తు చెల్లింపులు చేసిన కస్టమర్లకు రీఫండ్ ఆలస్యం కావడం వంటి అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వం ఈ విధానాలు వినియోగదారుల హక్కులను ప్రభావితం చేస్తున్నాయా అనే విషయాన్ని సమీక్షిస్తోంది.

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ ధరల ప్రకటన.. ఒక్కో షేరకు ఎంతంటే?

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా తొలి పబ్లిక్ ఆఫర్ ( ఐపీఓ)లో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ ఐపీఓ ద్వారా రూ.11,607 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఈ నెల 7వ తేదీన ప్రారంభమవుతోంది. అక్టోబర్ 9వ తేదీ వరకు ముగియనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ధరల శ్రేణిగా రూ.1080 నుంచి రూ.1140గా నిర్ణయించారు. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ప్రమోటర్లు తమ వాటాను విక్రయించనున్నారు.

ఇండియాలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్…

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌(HCL) టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. M3M హురున్ ఇండియా విడుదల చేసిన జాబితాలో2025లో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్నీ నాడార్ నిలిచింది, ఇండియాలోనే టాప్ 10 కుబేరుల జాబితాలో ఈమె అతి పిన్న వయస్కురాలు. రోష్ని నాడార్ మల్హోత్రా సంపద విలువ ఏకంగా రూ.2.84 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో ఆమె భారత మహిళా పారిశ్రామికవేత్తల్లో మొదటి స్థానంలో నిలిచారు.

పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఏపీ: సీఎం చంద్రబాబు

ఢిల్లీలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. భారతదేశంలో పెట్టే పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా ఉంటుందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులిస్తామని తెలిపారు. వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. విశాఖలో నిర్వహించే 30వ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామిక వేత్తలను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు సీఎం […]

వరుసగా ఎనిమిదో రోజు.. నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్ల నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం వరుసగా ఎనిమిదో రోజు మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్‌ ఉదయం లాభాల్లో మొదలైనా.. చివరకు నష్టాలు తప్పలేదు. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 80,541.77 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం వరకు మళ్లీ కోలుకున్నా కొద్దిసేపటికే మళ్లీ తగ్గాయి. ఇంట్రాడేలో 80,677.82 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌.. అత్యల్పంగా 80,201.15 పాయింట్లకు చేరింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON