loader

చట్టవిరుద్ధంగా వాకీ-టాకీల విక్రయం.. 13 ఈ-కామర్స్ సైట్స్‌కు రూ.10 లక్షల చొప్పున జరిమానా

చట్టవిరుద్ధంగా వాకీ-టాకీలు (Walkie-Talkie) విక్రయిస్తున్న ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (సీసీపీఏ) స్వయంగా చర్యలు చేపట్టింది. 13 ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్‌కు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించింది. చిమియా, జియోమార్ట్, టాక్ ప్రో, మీషో, మాస్క్‌మ్యాన్ టాయ్స్, ట్రేడ్ ఇండియా, ఆంత్రిక్ష్ టెక్నాలజీస్, వర్దాన్‌మార్ట్, ఇండియామార్ట్, మెటా ప్లాట్‌ఫామ్‌లు ఇంక్. (ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్), ఫ్లిప్‌కార్ట్, కృష్ణ మార్ట్, అమెజాన్ సంస్థలు 16,970కు పైగా చట్టవిరుద్ధంగా వాకీ-టాకీలు అమ్మినట్లు సీసీపీఏ గుర్తించింది.

’10 నిమిషాల్లో హోమ్ డెలివరీ’ బంద్.. కేంద్ర ప్రభుతం సంచలన నిర్ణయం !

ఆన్‌లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు గొప్పగా చెప్పుకునే ’10 నిమిషాల డెలివరీ’ గడువుకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. గిగ్ వర్కర్ల ప్రాణాల భద్రత దృష్ట్యా ఈ నిబంధనను వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం క్విక్ కామర్స్ సంస్థలను ఆదేశించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ప్రముఖ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మరోసారి షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. 3 గంటల్లోనే భారీ పెరుగుదల..

ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి దేశీయ మార్కెట్‌లో ఉదయం 24 క్యారెట్ల బంగారం ధర 650 పెరిగి ప్రస్తుతం రూ.1, 39,480గా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం రూ. 1,27,850గా కొనసాగుతుంది. హైదరాబాద్‌లో, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1, 39,480గా ఉండగా .. ఉదయం ఈ ధర రూ.1,38,830గా ఉంది. వెండి కేవలం మూడు గంటల్లోనే కేజీ […]

భారీగా పడిపోతున్న రిలయన్స్ షేరు.. అంబానీకి బిగ్ షాక్..

రిలయన్స్ కంపెనీ మార్కెట్ విలువ రూ. 20.61 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఒక్కరోజులోనే షేర్ ధర 4 శాతం వరకు తగ్గగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 70 వేల కోట్ల వరకు తగ్గింది. అంటే అదే స్థాయిలో ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చిందని,. ఇందుకు ప్రధాన కారణం.. రష్యా చమురుకు సంబంధించి ప్రకటనే. అవును.. రష్యా చమురుతో 3 నౌకలు.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందినటువంటి గుజరాత్ జామ్‌నగర్ రిఫైనరీకి బయల్దేరాయని బ్లూమ్‌బెర్క్ కథనం రాసింది.అయితే ఇది […]

వరల్డ్ వార్-3? దెబ్బకు పరుగులుపెడుతున్న బంగారం, వెండి ధరలు..

గోల్డ్‌ ప్రియులకు బంగారం రేట్లు షాక్ ఇచ్చాయి. మార్నింగ్ ఆరు గంటల నుంచి 24 క్యారెట్ల బంగారం తులంపై రూ.2000పైగా పెరగగా.. వెండి ధర కేజీపై రూ.6000 వరకు పెరిగింది. వెనిజులా సంక్షోభంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఇటీవలే హాల్‌టైం హైకి చేరుకున్న బంగారం ధరలు.. గత రెండ్రోజులుగా కాస్త తగ్గుతూ వచ్చాయి. ప్రపంచ వ్యక్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇవి బంగారం, వెండి, చమురు ధరలపై తీవ్ర ప్రాభావాన్ని చూపాయి.

బెర్క్‌షైర్ సీఈఓ పదవి నుంచి దిగిపోనున్న దిగ్గజ ఇన్వెస్టర్

ప్రముఖ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బెర్క్‌షైర్ హాత్‌వే సీఈఓ పదవి నుండి దిగిపోనున్నట్లు ప్రకటించారు. తన తర్వాత గ్రెగ్ అబెల్‌కు సీఈఓ బాధ్యతలు అప్పగించారు. వారెన్ బఫెట్ 1965లో బెర్క్ షైర్ హాత్‌వే బాధ్యతలు చేపట్టారు. క్రమశిక్షణ,దీర్ఘకాలిక వ్యూహాలతో ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ ఇచ్చారు. వీటిని అనుసరించిన ఎంతో మంది లాభాలు పొందారు. దీంతో స్టాక్ మార్కెట్‌ ప్రపంచంలో ఒక గొప్ప ఇన్వెస్టర్‌గా పేరు గడించాడు. పెట్టుబడులతో ప్రపంచంలోనే కుబేరుడిగా నిలిచాడు.

త్వరలోనే భారత్‌ నుంచి మలేరియాను పూర్తిగా తొలగిస్తాం : అమిత్‌ షా

భారత్ నుంచి మలేరియాను త్వరలోనే పూర్తిగా తొలగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. నేడు అహ్మదాబాద్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్వహించిన ఆలిండియా మెడికల్ కాన్ఫరెన్స్‌ లో ఆయన ప్రసంగించారు. భారత్‌లో మలేరియా కేసులు 97 శాతం తగ్గాయని, అతి త్వరలో దేశం నుంచి పూర్తిగా మలేరియాను తరిమేస్తామని అన్నారు. వికసిత్ భారత్‌–2047 లక్ష్యాన్ని సాధించాలంటే ఆరోగ్యవంతమైన ప్రజలు అవసరమని, అందుకు డాక్టర్లు.. ప్రభుత్వ పథకాల లక్ష్యం నెరవేరేలా కలిసి పనిచేయాలని కోరారు.

భారత్​లో అమెజాన్ భారీగా పెట్టుబడులు- రూ.3లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్

అగ్రశ్రేణి ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత విపణిలో మరో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. 2030 నాటికి మొత్తం 35 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.14 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ స్మభవ్ సమ్మిట్ సందర్భంగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట అమిత్ అగర్వాల్ ప్రకటించారు. ఆ పెట్టుబడి ద్వారా దేశంలో డిజిటలైజేషన్, AI ఆధారిత సాంకేతిక అభివృద్ధి, ఎగుమతుల పెంపు, వచ్చే ఆరు సంవత్సరాల్లో మరో 10 లక్షల డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్, సీజనల్, ఇండ్యూస్డ్ […]

వరుస నష్టాల నుంచి ఉపశమనం..

గత కొన్ని సెషన్లుగా వరుసగా నష్టపోతున్న దేశీయ సూచీలు బుధవారం కోలుకున్నాయి. లాభాలతో ప్రారంభమయ్యాయి. రూపాయి కాస్తా కోలుకోవడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటనపై ఆసక్తి, కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు (84, 666)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి ఎగబాకింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 313 పాయింట్ల లాభంతో […]

రూ.7 లక్షల కోట్లు ఆవిరి..భారత స్టాక్ మార్కెట్‌

భారత స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఆరంభం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన ఒత్తిడిలోకి జారుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల (FII) అమ్మకాలు మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడిని సృష్టించాయి. రూపాయి పతనం కూడా భారత స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసింది. పతనానికి కారణాలలో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, విదేశీ నిధుల వెలివేత, భారత్, అమెరికా వాణిజ్య చర్చల్లో పురోగతి లేకపోవడం వంటి అంశాలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON