ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినీ, నాటకరంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనవరిలో నంది నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ వేడుకలకు తెనాలి వేదిక కానున్నట్లు మంత్రి దుర్గేశ్ చెప్పారు. అక్టోబరులో ఎంపిక కమిటీ, డిసెంబరులో ప్రాథమిక జాబితా ప్రకటించి, జనవరిలో విజేతలకు పురస్కారాలు అందించనున్నట్లు చెప్పారు. సినిమా, టీవీ రంగాల నంది అవార్డుల నోటిఫికేషన్ను ఈ వారంలోనే విడుదల చేసి జనవరిలోగా అవార్డుల ప్రదానం పూర్తి చేస్తామని తెలిపారు.