భారత క్రికెట్ జట్టు టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ రింకూ సింగ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరి పెళ్లి తేదీ ఖరారైంది. ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరుగనుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని హోటల్ రమడలో ఈ వివాహ వేడుకను నిర్వహించడానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. చాలాకాలంగా రింకూ సింగ్, ప్రియా సరోజ్ వివాహ వార్తలపై విస్తృతంగా చర్చ సాగింది.