చైనా వేదికగా జరుగుతున్న జూనియర్ ఉమెన్స్ హాకీ ఆసియా కప్-2026లో భారత మహిళల జట్టు తిరుగులేని ప్రదర్శనతో అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 19-0 తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఏకపక్ష విజయంతో భారత జట్టు టోర్నమెంట్ సెమీఫైనల్స్కు అర్హత సాధించింది.భారత క్రీడాకారిణుల వేగం, వ్యూహాత్మక ఆటతీరు ముందు పాకిస్థాన్ డిఫెన్స్ పూర్తిగా విఫలమైంది. ఆట ముగిసే సమయానికి భారత్ ఏకంగా 19 గోల్స్ చేసి అద్భుత ఘనత సాధించింది.