మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు X వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోందన్నారు. కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలను తీర్చాలన్న సంకల్పంతో 1996లో తాను శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి సోమవారం ప్రారంభించే అవకాశం రావడం ఎంతో భావోద్వేగానికి, సంతోషానికి గురిచేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.