జాతీయ క్రీడా దినోత్సవం, భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గౌరవ సూచకంగా అతని పుట్టిన రోజైన ఆగష్టు 29 న జరుపుకుంటారు. ఈ దినోత్సవమును భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులు ఇచ్చి గౌరవిస్తారు. భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ (1905 ఆగష్టు 29, – 1979) డిసెంబరు 3, తన గోల్ స్కోరింగ్ విన్యాసాలతో, మొదట ఆటగానిగా , తర్వాత కెప్టెన్ గా గుర్తించబడ్డాడు. ధ్యాన్ చంద్ తన జట్టుతో మూడు ఒలింపిక్ బంగారు పతకాలు (1928 ఆమ్స్టర్డ్యామ్, 1932 లాస్ ఏంజెల్స్, 1936 బెర్లిన్) సాధించాడు.

