ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. తెలుగు వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకొంటాం సామాన్యులకు కూడా అర్థమయ్యేలా తెలుగు భాషను సరళీకరించి, వాడుక భాషను ప్రాచుర్యంలోకి తెచ్చిన గిడుగు వారి సేవలకు గుర్తింపుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.