ప్రతి సంవత్సరం ఆగస్టు 20 వ తేదీన భారతదేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతీయ సద్భావనా దివస్ (సామరస్య దినం) జరుపుకుంటారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలందరిలో శాంతి, జాతీయ సమైక్యత, మత సామరస్యాన్ని పెంపొందించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.