80వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి ప్రస్థానం, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, భవిష్యత్ భారతదేశ లక్ష్యాలపై ఆమె ప్రసంగంలో ప్రస్తావించారు. దేశ, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.