పశ్చిమబెంగాల్లో ఓ నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కోల్కతాలోని ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ వైద్య కళాశాల – ఆసుపత్రిలోని వాష్రూమ్లో ఆమె విగత జీవిగా కనిపించారు. అక్కడున్న సిబ్బంది వాష్రూమ్ తలుపులు పగలకొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల వయసున్న ఓ నర్సు.. ఇక్కడి గైనకాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె.. రాత్రి 10 గంటల సమయంలో వాష్రూమ్కి వెళ్లారు. ఎంతకూ బయటకు రాకపోవడం..సిబ్బంది తలుపులు పగలకొట్టారు. అక్కడే నేలపై అపస్మారక స్థితిలో ఆమెను గుర్తించారు.