loader

బీఆర్‌ఎస్‌ X కాంగ్రెస్‌ పాలనను బేరీజు వేసుకోండి: సీఎం రేవంత్‌రెడ్డి

పదేళ్ల గత పాలనను, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. కేపీహెచ్ బీ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కూకట్ పల్లి ప్రజలు తమకు కావాల్సిన పనులను మంత్రులతో చేయించుకోవచ్చని అన్నారు. 22ఏ నిషేధిత భూముల విషయంలో సమస్యలను పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు.

భువనగిరిలో విషాదం: విద్యార్థినిపై కూలిన చెట్టు!

యాదాద్రి భువనగిరిలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా చెట్టు కూలడంతో ఒక విద్యార్థిని మృతి చెందగా ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే భువనగిరి పట్టణం లోని బాగాయత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న భువనగిరి పట్టణానికి చెందిన 3వ తరగతి విద్యార్థిని అలీనా (8) స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా క్రీడలు ఆడుతున్న క్రమంలో అకస్మాత్తుగా చెట్టు విరిగి మీద పడడంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు […]

ఎయిరిండియా పైలట్లందరికీ ఇకపై డోప్‌ టెస్ట్‌

ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ పైలట్లందరికీ డోప్ టెస్ట్ను తప్పనిసరి చేసింది. ఇటీవల ఫుకెట్- దిల్లీ విమాన ఘటనలో పైలట్-ఇన్-కమాండ్ గంజాయి సేవించినట్లు డ్రగ్ టెస్టులో తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. డీజీసీఏ సూచించిన ర్యాండమ్ తనిఖీలు కాకుండా.. గురుగ్రామ్ అకాడమీలో శిక్షణ సమయంలో, విమాన ప్రయాణం ముగిసిన తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లైట్ బ్రీఫింగ్ సెంటర్లు, కార్యాలయాల్లో  పైలట్లకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయాణికుల భద్రత, పారదర్శకత, ఎయిరిండియా పాటిస్తున్న అత్యున్నత ప్రమాణాలను కాపాడేందుకే  ఈ […]

నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళన..

నిజాం కాలేజీలో విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యా సంవత్సరం మొదలై ఇన్ని రోజులు గడిచినా తమకు హాస్టల్స్ అలాట్ చేయడంలేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ చాంబర్‌ వద్దకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యం పోవాలంటే పోరాటాలు చేయాల్సిందే.. ఉద్యమాల గడ్డరా.. నిజాం కాలేజీ అడ్డరా.. అంటూ నినాదాలు చేశారు. తాము వసతి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని, వెంటనే […]

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. లోక్‌స‌భ విప‌క్ష నేత రాహుల్ గాంధీ ఆస్తుల‌పై సీబీఐ ఇచ్చిన వివ‌ర‌ణ ప‌ట్ల గ‌తంలో అల‌హాబాద్ హైకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. క‌ర్నాట‌క నివాసి ఎస్ విఘ్నేశ్ సిసిర్ దాఖ‌లు చేసిన రిట్ పిటీష‌న్ ఆధారంగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌర‌స‌త్వం ఉన్న‌ట్లు కూడా గ‌తంలో విఘ్నేశ్ ఓ పిల్ […]

హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా గుత్తాల గోపి

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలువురు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.బదిలీలతో పాటు హైకోర్టు పరిపాలనా విభాగంలో పలు కొత్త నియామకాలను చేపడుతూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) శ్రీనివాస శివరాం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి (PDJ)గా పనిచేస్తున్న గుత్తాల గోపి ఏపీ హైకోర్టు నూతన రిజిస్ట్రార్‌ జనరల్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా వ్యవహరించిన వైవీఎస్‌బీజీ పార్థసారధిని ఏపీ జ్యుడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా నియమించారు

టాటా సన్స్ ఛైర్మన్ రేసులో నరేంద్రన్?

టాటా సన్స్ ఛైర్మన్‌గా తాజాగా టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) & CEO టి.వి. నరేంద్రన్ పేరు ఈ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. 61 ఏళ్ల టీవీ నరేంద్రన్ 1988లో టాటా గ్రూప్‌లో తన కెరీర్‌ను ప్రారంభించి, దాదాపు 38 ఏళ్లుగా ఈ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2013 నుంచి టాటా స్టీల్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన, ఉక్కు రంగంలో అంతర్జాతీయంగా వచ్చిన అనేక హెచ్చుతగ్గులను తట్టుకొని సంస్థను సమర్థవంతంగా ముందుకు […]

ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కంటైనర్.. ముగ్గురు మృతి!

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ సమీపంలోని జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కిన్వాట్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రైవేట్ బస్సు టైరు పంచర్ కావడంతో కొంతమంది ప్రయాణికులు కిందకు దిగి రహదారి పక్కన ఉన్న డివైడర్‌పై కూర్చున్నారు. కంటైనర్ లారీ ఢీకొట్టడంతో బస్సు ముందుకు […]

రాజకీయాలు వదులుకుంటా.. పార్టీ మార్పుపై పోచారం కీలక వ్యాఖ్యలు

సీనియర్ నేత, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై మరోసారి స్పందించారు. గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చినట్లు పునరుద్ఘాటించారు. తాను ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. తనకు స్వార్థం ఉందని కొందరు బుద్ధిహీనులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు […]

నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి..

మహారాష్ట్రలోని నాందేడ్‌లో శిరోమణి అకాలీ దళ్ జాతీయ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి జరిగింది. తన కుటుంబ సభ్యులతో కలిసి గురుద్వారా మాతా సాహిబ్ కౌర్‌లో పూజలు చేసేందుకు వెళ్లిన సమయంలో , ఓ నిహంగ్ సిక్కు కిర్పాన్‌తో బాదల్‌పై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో బాదల్ భద్రతా సిబ్బంది కూడా అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాడిలో బాదల్ చేతికి గాయమైంది. దాడి జరిగిన వెంటనే ఆయనను చికిత్స […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON