దేశంలో సంచలనం సృష్టించిన నీట్ లీకేజీ వివాదంపై పోరాటం చేసిన కాక్రోచ్ జనతా పార్టీ ఇక నుంచి సామాన్య ప్రజల సమస్యలు తెలుసుకోనుంది. దీని కోసం ‘క్యా బోల్తీ పబ్లిక్’ అనే దేశవ్యాప్తంగా ప్రజా అవగాహన కార్యక్రమాన్ని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గురువారం ప్రకటించారు. ‘క్యా బోల్డీ పబ్లిక్’ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారాలపై చర్చించడంతో పాటు సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తామని అభిజీత్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావాలని కోరారు.