ఎయిర్ ఇండియా విమానం గాలిలో ఉన్న సమయంలో భారీ కుదుపుకు లోనైంది. ఈ ఘటనలో సుమారు 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. థాయ్ల్యాండ్లోని పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులతో పాటు ఇద్దరు విమాన సిబ్బంది కూడా గాయపడినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది. కుదుపు వల్ల విమానానికి ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఆల్టిట్యూడ్ మార్పు సమయంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.
ఏదేమైనా ఆ విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.