వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై భూ కబ్జా కుట్ర కేసు నమోదైంది. భూమి అసలు యజమాని బతికుండగానే, అతను చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్న సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ నకిలీ సర్టిఫికెట్ ఆధారంగా తప్పుడు వారసత్వ ధృవీకరణ పత్రాలను రూపొందించి, ఆ భూమిపై అక్రమంగా హక్కులు పొందేందుకు ప్రయత్నించారని పోలీసులు కేసు నమోదు చేశారు. తమ్మినేని తనయుడు చిరంజీవి నాగ్ (A5), తమ్మినేని భార్య వాణిని ఏడో నిందితురాలిగా (A7) చేర్చారు.