ప్రజల ఆస్తిపై ప్రజలకే పూర్తి హక్కు ఉండాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశామని ప్రకటించారు.