ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై.. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ భారీ ప్రజా కార్యక్రమానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు.