సంచలనం సృష్టించిన ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులు అలం ఖాన్ అతని కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.15 లక్షల సుపారీ ఇచ్చి, కారు స్టంట్స్లో నిపుణుడైన అభిజిత్తో సహా ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. వక్ఫ్ భూ వివాదం కేసు నుంచి వైదొలిగితే రూ.2 కోట్లు ఇస్తామంటూ మొహిజుద్దీన్ కు ఆఫర్ చేశారు. అయితే రాజీ పడబోనని చెప్పడంతో మొయిజుద్దీన్ ను హత్యను చేయాలని భావించారు.

