కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, తన ఎక్స్ (X) ఖాతాను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఎక్స్ కు నోటీసులు జారీ చేసింది.అయితే ఈ కేసును విచారించిన జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్.. కాక్రోచ్ పార్టీ ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించడానికి నిరాకరించారు. ఈ రోజు నుండి నాలుగు వారాలలోగా కేంద్రం స్పందన దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే నిలిపివేత ఉత్తర్వును సమీక్షించాలని కూడా కోర్టు ఆదేశించింది.

