కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థల్లో వస్త్రధారణపై సంచలన నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులు యూనిఫాంతో పాటు హిజాబ్, జనివార (జంద్యం), టర్బన్ (పాగా) వంటి మతపరమైన చిహ్నాలు ధరించడానికి అనుమతినిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బీజేపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ విద్యాశాఖ కొత్త నిబంధనలను రూపొందించింది. దీని ప్రకారం తరగతులు, పరీక్షల సమయంలో విద్యార్థులు తమ సాంప్రదాయ చిహ్నాలైన రుద్రాక్షలు, శివధార, స్కార్ఫ్ వంటివి ధరించవచ్చు.

