తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్ధితుల్లో అన్నాడీఎంకేలో చీలిక (AIADMK) ఏర్పడింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని వ్యతిరేకిస్తూ 30 మంది రెబెల్ ఎమ్మెల్యేలు గళం విప్పారు. సీఎం విజయ్ (Vijay)కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. దీంతో సీఎం విజయ్ ఇవాళ అన్నాడీఎంకే రెబెల్ నేత షణ్ముగం ఆఫీసుకు వెళ్లారు. దీంతో రెబెల్ వర్గం మద్దతు పొందడంలో విజయ్ సక్సెస్ అయినట్లే అని తెలుస్తోంది.

