ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా వేలాది జంతువులను బలి ఇవ్వనున్నారని సమాచారం ఉందని మేనకా గాంధీ పేర్కొన్నారు. భక్తి పేరుతో జరుగుతున్న ఈ చర్యలను ఆమె “సామూహిక మారణకాండ”గా అభివర్ణించారు. “జాతర పేరుతో జరుగుతున్న ఈ ఘటనలు దేశం మొత్తం గమనిస్తోందని.. ఇది మన సంస్కృతికి మచ్చ” అంటూ ఆమె లేఖలో తీవ్రంగా స్పందించారు. జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టాలు దేశంలో ఇప్పటికే అమలులో ఉన్నాయని ఆమె గుర్తు చేశారు.