చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమకు తిరుగులేదని నిరూపించింది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఉఫ్మనిపించింది. పవర్ ప్లేలోనే గుజరాత్ బౌలర్లకు దడ పుట్టించిన విరాట్ కోహ్లీ(81), దేవ్దత్ పడిక్కల్(55) అర్ధ శతకాలతో విజయానిక బాటలు వేయగా.. ఆఖర్లో రషీద్ ఖాన్(2-49) విజృంభణతో గుజరాత్ పోటీలోకి వచ్చింది. కానీ, కృనాల్ పాండ్యా(23 నాటౌట్) మెరుపులతో గుజరాత్కు ఓటమి తప్పలేదు. ఐదో విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

