వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి, హత్యాయత్నంపై వైసీసీ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ లేఖ రాసిందని సీనియర్ నాయకుడు, వైసీపీ పార్లమెంటరీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు . రాష్ట్రంలో ప్రతిపక్షాల నాయకుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, ఫలితంగా అంబటి ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడికి దిగి ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు.

