తెలంగాణ పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యే క్రమంలో ప్రవేశపెట్టిన ‘FIR ఎట్ డోర్ స్టెప్’ విధానం విజయవంతంగా ప్రారంభమైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా గాగిల్లాపూర్లో ఈ పద్ధతిలో తొలి కేసు నమోదైంది. ఒక వ్యక్తి తన విల్లాలో దొంగతనం జరిగిందని డయల్ 100కు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే స్పందించి బాధితుడి ఇంటికి చేరుకున్నారు. పోలీసులు స్వయంగా బాధితుడి వద్దకే వచ్చి అక్కడికక్కడే FIR నమోదు చేయడం అనేది శాంతిభద్రతల నిర్వహణలో ఒక విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు.

