ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ‘చెవాలియర్’ (Chevalier Award) అవార్డ్కు ఆయన ఎంపికయ్యారు. చెన్నైలోని ఫ్రెంచ్ కాన్సులేట్ ఆయనకు ఈ పురస్కారాన్ని రేపు ప్రదానం చేయనున్నారు. ‘ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో చదివిన తోట తరణి భారతదేశం నుంచి గొప్ప వ్యక్తుల జాబితాలో చేరి ఈ అవార్డును అందుకోవడం చూడటం గౌరవంగా ఉంది. మీ అద్భుతమైన విజయానికి అభినందనలు’ అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు.

