loader

వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్- వరుడు ఎవరంటే ?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఏకైక కుమార్తె అంజలీ రెడ్డి పెళ్లి నిశ్చయం అయింది. తమ కుమార్తె వై.ఎస్. అంజలి రెడ్డి వివాహం, సోమల సుబ్బారెడ్డి – సోమల పద్మారెడ్డి కుమారుడైన డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డి తో నిశ్చయమైన శుభవార్తను పంచుకోవడానికి తాను, తన భర్త అనిల్ కుమార్ ఎంతో సంతోషిస్తున్నామని వైఎస్ షర్మిల ఇవాళ ట్వీట్ చేశారు. వారి కుటుంబ సభ్యులందరూ అమెరికా పౌరులు , వీరు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు […]

హెరిటజ్‌లో పాలు, పెరుగు అమ్మినట్టు టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు..

కూటమి పాలనలో హెరిటజ్‌లో పాలు, పెరుగు అమ్మినట్టు రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రావటం విద్యార్థులకు శాపమన్నారు. టెట్‌కి, డీఎస్సీకి ఒకరినే కన్వీనర్‌గా పెట్టడం దగ్గర నుంచి.. సంతలో బర్రెలు అమ్మినట్టు టీడీపీ నేతలు ఉద్యోగాలు అమ్మేసేంతవరకు ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించాం.డీఎస్సీలో అక్రమాలపై ప్రభుత్వం ప్రజలకు సంజాయిషి చెప్పాలని మీకు చిత్తశుద్ధి ఉంటే సీబిఐ విచారణ జరిపించండి అని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్‌ చేశారు.

నెల్లూరులో ఏసీబీ త‌నిఖీలు.. బ్రేక్ ఇన్స్‌పెక్ట‌ర్ కారులో భారీగా న‌గ‌దు!

నెల్లూరు లోని కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఏసీబీ (ACB) అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ డబ్బుతో అధికారులకు పట్టుబడ్డాడు. బ్రేక్ ఇన్స్పెక్టర్ వాహనాలను నిలిపి భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ గోపి నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుండి 2.48 లక్షల రూపాయల నగదుతో పాటు ఒక కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బద్దలైన అగ్ని పర్వతం.. జకార్తాను కమ్మేసిన బూడిద..

ఇండోనేషియాలోని ప్రసిద్ధ అగ్నిపర్వతం ‘అనక్ క్రాకటోవా’ ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా బద్దలైంది. పశ్చిమ ఇండోనేషియాలోని పలు ప్రాంతాల్లో భారీగా అగ్నిపర్వత బూడిద అలముకుంది. ఈ పరిణామం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జకార్తాలోని సోకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. బూడిద దట్టంగా వ్యాపించడంతో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇండోనేషియా ప్రధాన ద్వీపాలైన జావా, సుమత్రాల మధ్య ఉన్న సుందా జలసంధిలో ఈ అగ్నిపర్వత ద్వీపం ఉంది.

మ‌హారాష్ట్ర‌లో దాండియాకు వీహెచ్‌పీ రూల్స్‌!

అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న గర్భా, దాండియా వేడుకల్లో ముస్లింలను అనుమతించబోమని VHP కార్యదర్శి శ్రీరాజ్ నాయర్ స్పష్టం చేశారు. విగ్రహారాధనను వ్యతిరేకించే ముస్లింలు హిందూ దేవతను పూజించే ఈ వేడుకల్లో పాల్గొనడం తగదని ఆయన వాదించారు. ఈ వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమ గుర్తింపును నిరూపించుకోవడానికి ఆధార్ కార్డు చూపించడం తప్పనిసరి, ఉత్సవాల వద్దకు వచ్చే వారి నుదుటిపై తిలకం తప్పకుండా ధరించాలి ముస్లింలు పాల్గొనాలి కుటుంబసభ్యులు, భార్యలు, పిల్లలు, సోదరీమణులతో కలిసి […]

బెల్జియం ప్రధాని.. మోదీకి ఇవ్వాలనుకున్న చాక్లెట్‌ ఇదే!

భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రత్యేకంగా ‘ఇండియా గేట్’ ఆకృతిలో ఉన్న చాక్లెట్ ను తయారు చేయించారు. అయితే అది మార్గమధ్యలోనే కరిగిపోయి పాడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ లో బెల్జియం దౌత్యకార్యాలయం తాము తయారు చేయించిన ‘ఇండియా గేట్ చాక్లెట్’ చిత్రాన్ని ఎక్స్ వేదికగా పంచుకుంది. భారత్ పర్యటన సందర్భంగా మోదీకి ఈ వినూత్న కానుకను అందించాలని వెవర్ భావించారు. అయితే భారత్ కు […]

సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగి ఆత్మహత్య

ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ అసిస్టెంట్ ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది. నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామానికి చెందిన ఆకు బత్తిని పవన్ గత ఏడు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసతున్నారు. ఆదివారం ఉదయం ఆస్పత్రిలోని పవన్ ఉరేసుకున్నాడు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల వేధింపులా? లేక వ్యక్తిగత కారణాలా? అనే […]

దీపావళి రైలు టికెట్ల బుకింగ్ షురూ..

ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 28వ తేదీన రానుంది. పండుగ రోజుల్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని  రిజర్వేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. పండుగ ముందు రోజూ, ప్రయాణాలకు అత్యంత కీలకమైన నవంబర్ 6 మరియు 7 తేదీల ప్రయాణాలకు గానూ 60 రోజుల ముందస్తు రైలు టికెట్ల రిజర్వేషన్ ఈరోజు (సెప్టెంబర్ 6)  ప్రారంభమైంది. పండుగ వేళ రైలు ప్రయాణం సులభతరం చేసేందుకు భద్రతతో పాటు కౌంటర్ల వద్ద ప్రత్యేక […]

అమెరికా కు ఇరాన్ షాక్.. 6 నౌకలపై దాడులు

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పరాకాష్ఠకు చేరాయి. ఇటీవల అమెరికా సెంట్రల్ కమాండ్ జరిపిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన మూడు క్రూడాయిల్ ట్యాంకర్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతికారంగా ఇరాన్ విప్లవాత్మక గార్డ్స్ కోర్ (IRGC) విరుచుకుపడింది. పశ్చిమ ఆసియాలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గం ‘హార్ముజ్ జలసంధి’ దాటేందుకు ప్రయత్నిస్తున్న మూడు నూనె ట్యాంకర్లు మరియు మరో మూడు వాణిజ్య నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు ప్రకటించింది.

నా వల్లే ఇదంతా.. కొండా సుష్మిత కన్నీళ్లు!

తన వల్లనే తన తల్లి పదవి కోల్పోవాల్సి వచ్చిందంటూ కొండా సుష్మిత కన్నీళ్లు పెట్టుకున్నారు.తల్లి మంత్రి పదవి తొలగింపుపై సుష్మిత ఆక్రోశం వ్యక్తం చేశారు. “నా వల్లే ఇదంతా జరిగింది. అసలు మా అమ్మ ఏం తప్పు చేసిందని ఈ స్థాయిలో అవమానించారు?” అని ఆమె ప్రశ్నించారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సోదరుల అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు, చిట్టా తన వద్ద ఉన్నాయని, త్వరలోనే వాటిన్నింటినీ బయటపెట్టి మాట్లాడతానని హెచ్చరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON