loader

గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్

గరికపాటి చేసిన వ్యాఖ్యల పట్ల AP ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తీవ్రంగా స్పందించారు, మధ్యాహ్న భోజనం అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, అది ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి బిడ్డకు ఉన్న ప్రాథమిక హక్కు. కేవడం జీవించడం మాత్రమే కాదు. గౌరవంగా బతకడం అనేది దాని ఉద్దేశం. పోషకాహారం పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు. కోర్టు దీన్ని ఓ రాజకీయ అంశంగా కాకుండా పిల్లలకు దక్కాల్సిన హక్కుగా భావించి […]

హర్మూజ్ జలసంధిని తెరవండి.. ఇరాన్‌కు 22 దేశాల విజ్ఞప్తి..

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం కారణంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో ఇంధన లోటుతో పలు దేశాలు ఇబ్బందులు ఎదురుకుంటున్నాయి. తాజాగా హర్మూజ్ జలసంధిని తెరవాలని పలు దేశాలు ఇరాన్‌ను కోరాయి. దాడులను ఆపాలని కూడా ఇరాన్‌ను 22 సంయుక్త ప్రకటన చేశాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను పలు దేశాలు ఖండించాయి. యుఎఇ, బహ్రెయిన్, యుకె, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ఈ దాడులను ఆపాలని […]

ఎయిమ్స్ ఆస్పత్రిలో లైంగిక వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం

మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. సెక్యూరిటీ సూపర్ వైజర్ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహిళను సెక్యూరిటీ సూపర్ వైజర్ మోహనచారి ఏడేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తాను చెప్పినట్టు వినాలని లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరిస్తున్నాడు.ఈ మధ్య వేధింపులు మరీ ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. మహిళ భర్త చనిపోవడంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తోంది.

ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన ఇరాన్.. జెరూసలెంను తాకిన మిసైల్..

శత్రుదేశం ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడుతోంది. మిసైల్స్, డ్రోన్ దాడులతో విధ్వంసం సృష్టిస్తోంది. పవిత్ర రంజాన్ రోజు ఇరాన్ మిసైల్ జెరూసలెంలో పడింది. అది కూడా అల్ అక్సా మసీదుకు కొద్దిదూరంలో ఈ మిసైల్ దాడి జరిగింది. దీంతో వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు నిలిపేయాల్సి వచ్చింది. . రంజాన్ సందర్భంగా ఇరాన్ మిసైల్ జెరూసలెంలో పడింది. అది కూడా ముస్లింలు, క్రిస్టియన్స్, యూదుల పవిత్ర స్థలాలకు కొద్దిదూరంలో ఈ దాడి జరిగింది. ఇదీ ముల్లాల నిజ స్వరూపం’ […]

మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

మాజీ డీజీపీ మనవరాలు, మహిళా వ్యాపారవేత్త దివ్యారెడ్డి 18 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్చి 13న సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంటెంట్‌కు వాట్సాప్ మెస్సేజ్ చేశారు. తాను మీటింగ్ లో ఉన్నానని, తాను చెప్పిన బ్యాంకు అకౌంట్కు  రూ.1.2 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ వాట్సాప్ అకౌంట్ పేరు, ఫొటోలు దివ్యారెడ్డివే ఉండటంతో నమ్మిన అకౌంటెంట్ మనీ పంపారు.  విషయం గ్రహించిన బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు నగదు మోసంపై ఫిర్యాదు చేశార

భారత్‌ పరిస్థితిపై ఆర్బీఐ మాజీ గవర్నర్‌ వార్నింగ్‌!

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా–ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందన్నదే ప్రపంచ ఆర్థిక గమ్యాన్ని నిర్ణయించే కీలక అంశమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘర్షణ ఇప్పటికే ప్రపంచ ఇంధన సరఫరాలో 15 శాతం నుంచి 20 శాతం వరకు అంతరాయాన్ని కలిగించే స్థాయికి చేరుకుంది.ఈ సంక్షోభాన్ని ప్రపంచానికి ఒక హెచ్చరికగా భావించి, దేశాలు తమ ఆర్థిక […]

దీపాల వెలుగుల్లో భద్రాద్రి.. రాములోరి కళ్యాణానికి అంతా సిద్ధం!

దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి బ్రహ్మోత్సవాలకుముస్తాబైంది. రామక్షేత్రంలో అంకురార్పణ తో వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. దీంతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం, కల్యాణమండపం పరిసరప్రాంతాలు చలువ పందిళ్లు చాందినీ వస్త్రాలతో అలంకరిస్తున్నారు. ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేపట్టడంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది.మార్చి 27 న సీతారాముల కల్యాణం,28 న రాముడు పట్టాభిషేకం జరగనుంది.

ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా..ముడి చమురు లేదన్న టెహ్రాన్

సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరాను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. అమెరికా మినహాయింపులపై ఇరాన్ స్పందిస్తూ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు తమ వద్ద అదనపు ముడి చమురు లేదని టెహ్రాన్ తెలిపింది. ఈమేరకు ఇరాన్ ఇంధన మంత్రిత్వశాఖ ప్రతినిధి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. చమురు సరఫరాపై ఆందోళనలు తగ్గించేందుకే యూఎస్ ఇలాంటి ప్రకటన చేసిందన్నారు.

కేంద్రం కీలక నిర్ణయం.. కమర్షియల్ గ్యాస్ సరఫరా 20శాతం పెంపు

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రాలకు అదనంగా మరో 20శాతం కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈనెల 23వ తేదీ నుంచి అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల 10శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని నీరజ్ మిట్టల్ స్పష్టం చేశారు. హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సూచించారు.

ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని నరేంద్రమోదీ ఫోన్..

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా రంజాన్‌, పర్షియన్‌ నూతన సంవత్స నౌరుజ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్వదినాలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు, ప్రపంచ సరఫరా గొలుసుకు ఆటంకం కలిగించే కీలక మౌలిక సదుపాయాలపై దాడులను ప్రధాని ఖండించారు. ఇరాన్‌లోని భారతీయుల రక్షణకు ఆ దేశం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON