భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐరోపా పర్యటనలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. గత 33 సంవత్సరాలలో ఒక భారత ప్రధాని 1993లో ఒక స్వతంత్ర దేశంగా స్లోవేకియా అవతరించిన తర్వాత, ఆ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకున్నారు. మోదీకి స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానార్ అక్కడి సాంప్రదాయ పద్ధతి అయిన ‘బ్రెడ్ అండ్ సాల్ట్’ అందించి ఘన స్వాగతం పలికారు.