loader

కూటమి 15 ఏళ్లు స్థిరంగా ఉండాలి: పవన్ కల్యాణ్

కూటమిలో ఉన్న మూడు పార్టీల్లోని నేతలు, కార్యకర్తలకు చిన్నచిన్న పొరపచ్చాలు ఉన్నా.. మీ స్ధాయిలోనే పరిష్కరించుకొని ముందుకెళ్లాలని పవన్ కల్యాణ్ సూచించారు. మన కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారనిని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అభివృద్ధిలో వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ తిరిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలని ఆకాంక్షించారు. కనీసం 15 సంవత్సరాలు ఈ కూటమి చాలా బలంగా ఉండాలన్నారు.

ఏపీలో రూ.5 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులకు శంకుస్థాపనలు

ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. 29 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన , ప్రారంభోత్సవం చేశారు. అభివృద్ధికి, నాగరికతకు రహదారులు చిహ్నం” అని చంద్రబాబు పేర్కొన్నారు. మంచి రహదారులు ఆర్థిక వృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయని ఆయన తెలిపారు. ఈ 29 జాతీయ రహదారి ప్రాజెక్టులు 272 కిలోమీటర్ల పొడవును కవర్ చేస్తాయి, రాష్ట్రంలో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయన్నారు.

ఎంపీ బాలశౌరి ఆఫీసులో పనిచేసే వ్యక్తి నిర్వాకం. . కోటి రూపాయలు వసూలు

జనసేనకు చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కార్యాలయంలో పనిచేస్తున్న గోపాల్ సింగ్ అనే వ్యక్తి మచిలీపట్నం వైద్య కళాశాల, కృష్ణ యూనివర్సిటీ, విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్సిస్తానని ఒక్కొక్కరి వద్దా 1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకూ వసూలు చేసినట్లు సమాచారం. మొత్తం వంద మంది బాధితుల నుంచి కోటిన్నర వరకూ గోపాల్ సింగ్ వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

స్ట్రీట్‌ వ్యూలో ప్రైవేట్‌ ఫొటో..! గూగుల్‌కు భారీగా జరిమానా విధించిన కోర్టు

అర్జెంటీనాలో ఓ పోలీస్‌ అధికారి   ఇంటి నుంచి గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూ కారు వెళ్లింది. అధికారి తన ప్రైవేట్‌ స్థలంలో ఉన్నాడు. స్థలానికి ఎత్తయిన గోడ సైతం ఉంది. ఆ స్థలంలో ఆయన నగ్నంగా ఉన్న సమయంలో గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూ కారు వెళ్లడంతో అందులో రికార్డయ్యింది. అప్పీలేట్‌ కోర్టును ఆశ్రయించగా గోప్యతా హక్కును గూగుల్‌ ఉల్లంఘించదని పేర్కొంటూ కోర్టు గూగుల్‌కు 12,500 (భారతీయ కరెన్సీలో రూ.10.8లక్షలు) డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

చంపి డ్రమ్ములో వేస్తానన్న భార్య.. దెబ్బకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త!

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ తన భర్తను చంపేస్తానని బెదిరించింది. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి ఫోన్‌లో తన భర్తను నీలిరంగు డ్రమ్‌లో నింపుతానని బెదిరించింది. ఆ తర్వాత భయపడిన భర్త తన భార్యకి, ఆమె ప్రేమికుడికి ఒక ఆలయంలో వివాహం చేశాడు. తన భార్య తనను చంపేస్తానని చాలాసార్లు బెదిరించిందని, అందుకే తాను భయపడ్డానని బాధితుడు చెప్పాడు.

మళ్లీ కలిసి సైనా నెహ్వాల్, కశ్యప్..విడాకుల పోస్ట్ డిలీట్

రెండు వారాల క్రితం విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించిన భారత బ్యాడ్మింటన్ జోడి సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్.. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. విడాకుల గురించి పునరాలోచిస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించి జూలై 13న చేసిన విడాకుల పోస్టుని డిలీట్ చేశారు.. ‘కొన్నిసార్లు దూరం, దగ్గర విలువని తెలియచేస్తున్నారు. అవును.. మేం మరోసారి ప్రయత్నిస్తున్నాం.. ’ అంటూ లవ్ సింబల్స్‌తో పోస్ట్ చేశారు.

మాజీ ప్రధాని మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు.

అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, జేడీఎస్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలోని హోలెనరసిపురలో ఉన్న ఫామ్‌హౌస్‌లో 47 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో శనివారం కోర్టు ఆయనకు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. రేవణ్ణ అరెస్టు అయిన దాదాపు 14 నెలల తర్వాత.. విచారణ ప్రారంభమైన ఎనిమిది వారాలలోపే న్యాయమూర్తి సంతోష్ గజానన భట్ ఈ తీర్పును వెలువరించారు.

పొలంలోకి దిగి వరినాట్లు వేసిన హోం మంత్రి..

రాష్ట్ర హోమ్ మినిష్టర్ సాధారణ రైతులా మారి పొలాల్లో వరినాట్లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయనగరం జిల్లాలో పర్యటనలో భాగంగా గ్రామానికి వెళ్తుండగా గ్రామ సమీపంలో రోడ్డు ప్రక్కన పొలంలో నాట్లు వేస్తున్న రైతులను చూసి వెంటనే ఆగారు. వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా అందరినీ పలకరించారు. అక్కడ నుండి అతికష్టం మీద పొలం గట్లపై నడుస్తూ పొలంలోకి దిగారు. తమతో కలిసి వరి నాట్లు వేయడం పట్ల రైతులు, కూలీలు హర్షం వ్యక్తం చేశారు

తలైవా యాక్షన్ వేరే లెవల్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజు తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.కూలీ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా కూలి మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున నెగిటివ్ […]

అన్నదాత సుఖీభవ ప్రారంభం..

పీఎం కిసాన్ పథకం నగదు 20వ విడత నగదును ప్రధాని విడుదల చేశారు.ఆకార్యక్రమాన్ని చంద్రబాబు రైతులతో కలిసి వీరాయపాలెంలో నులక మంచాలపై కూర్చొని తిలకించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. కేంద్రం పీఎం కిసాన్‌ పథకం ద్వారా ఏటా ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్రప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14 వేలు కలిపి ఒక్కొక్కరికీ రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగానే తొలి విడత రూ.7 వేలను శనివారం రైతుల […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON