మహారాష్ట్ర ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేయాలన్న రాహుల్ గాంధీ..
రాహుల్ గాంధీ సోషల్ మీడియా Xలో ఒక పోస్ట్ ద్వారా ఎన్నికల కమిషన్ పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తారు. కమిషన్ ముఖ్యమైన ఆధారాలను దాచిపెడుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన ఆరోపించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఓటర్ల గోప్యత, భద్రతను నిర్ధారించడం అవసరమని చెబుతూ, పోలింగ్ కేంద్రాల CCTV ఫుటేజ్లను 45 రోజుల్లోపు నాశనం చేయాలనే తన నిర్ణయాన్ని కమిషన్ సమర్థించుకుంది. ఓటర్ల గోప్యతా హక్కును పరిగణనలోకి తీసుకోవడంతో పాటు చట్టపరమైన ఆటంకాల […]

