మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పరిచా వందే భారత్ రైల్లో ప్రయాణిస్తున్నాడు. అయనకు విండో సీట్ రాలేదు. ఓ ప్రయాణికుడిని సీట్లు మార్చుకోవాలని కోరాడు కానీ దానికి నిరాకరించాడు దీంతో ఎమ్మెల్యే ఫోన్లు చేసి ఝాన్సీ రైల్వే స్టేషన్ కు గూండాల్ని పిలిపించాడు. ఝాన్సీ రైల్వే స్టేషన్లో దాదాపు 15-20 మంది వ్యక్తులు ప్రకాష్పై దాడి చేసి ముక్కు, చెవులు నోటి నుండి రక్తం కారేలా కొట్టారు. రైల్వే పోలీసులు ఎమ్మెల్యే అనుచరులకే సపోర్టు చేశారు.

