loader

కాంట్రవర్సీలోనూ కులం గోల… గూగుల్ చేస్తున్న నెటిజన్లు

ఎంఎం కీరవాణి, చంద్రబోస్, గాయని సునీత మీద ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలు చేయడం… ఆమె ఆరోపణలకు సునీత, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ క్లారిటీ ఇవ్వడం.. ఈ కాంట్రవర్సీలోనూ కొందరు కులం ప్రస్తావన తెస్తున్నారని తెలుసా? లాస్ట్ సెవెన్ డేస్ డేటా తీస్తే… ప్రవస్తి ఆరాధ్య కులం ఏమిటో తెలుసుకోవాలని ఏపీలో జనాలు ఆసక్తి కనబరిచారు. యంగ్ సింగర్ క్యాస్ట్ గురించి గూగుల్ చేయడం స్టార్ట్ చేశారు. తెలంగాణలో ప్రవస్తి ఆరాధ్య కులంపై కాస్త ఆలస్యంగా ఆసక్తి మొదలైంది. తమిళనాడులో […]

పహల్గామ్ ఉగ్రదాడి..పాకిస్థాన్ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం “దాడి చేసినా లేదా బెదిరించినా” దేశం తనను తాను రక్షించుకోవడానికి కలిసి నిలబడుతుందని అన్నారు. తాము రాజకీయం విభజించబడి ఉన్నప్పటికీ, దేశం కోసం ఒక్కటిగా నిలబడుతామని అన్నారు. తమ మాతృభూమిని రక్షించుకోవడానికి పాకిస్తాన్ జెండా కింద కలిసి ఉంటామని ఎక్స్ వేదికగా ఫవాద్ పోస్ట్ చేశాడు. అయితే, ఈ పోస్టులో పహల్గామ్ దాడి గురించి ఎలాంటి సంతాపం కానీ, ఖండన కానీ, ప్రస్తావన […]

తిరుమల భద్రతా లోపాలపై కేంద్రం ఆరా- ఏం జరుగుతోంది..!!

తిరుమలలో భద్రతా లోపాల పై కేంద్రం ఆరా తీసింది. కొంత కాలంగా చోటు చేసుకుం టున్న వరుస పరిణామాల పైన స్పందించాలని సూచించింది. తిరుమలలో భద్రతా వైఫల్యాల పైన తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్రానికి ఫిర్యాదు చేసారు. తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. రెడ్ బుక్ రాజ్యాంగంపై దృష్టి సారించిన ప్రభుత్వం పాలనపై పట్టు కోల్పోయిందని పేర్కొన్నారు.తిరుమలలో భద్రతా లోపాలు భక్తుల జీవితాలను ప్రమాదంలో పడేయడంతో పాటు, వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పవిత్రతను తీవ్రంగా దెబ్బతీశాయని […]

రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. బుధవారం రాత్రి విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రమౌళి భౌతికకాయానికి నివాళి అర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బృందం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏడు రోజుల జపాన్‌ పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. హైదరాబాద్​ ఫ్యూచర్​ సిటీలో నెక్స్ట్​ జనరేషన్​ ఇండస్ట్రియల్​ పార్క్​ ఏర్పాటు చేసేందుకు మారుబెని కంపెనీతో అగ్రిమెంట్​ చేసుకున్నారు. జపాన్​లో 500 ఉద్యోగ నియామకాలకు టామ్​ కామ్​… టెర్న్​.. రాజ్​ గ్రూప్​ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.

ఠారెత్తిస్తున్న ఎండలు , మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, వడగాల్పుల ప్రభావం అత్యవసరమైతే తప్ప పగటి సమయంలో ప్రజలు బయట తిరగవద్దు మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ రానున్న 3 రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాల్పులు ఉండనున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

‘క్రమశిక్షణ’ కొరడా.. ఆరుగురు పీసీసీ పరిశీలకుల తొలగింపు

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణపై దృష్టిపెట్టిన ఆమె బుధవారం గాంధీభవన్‌లో నియోజకవర్గాల పరిశీలకుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి కొందరు పరిశీలకులు ఆలస్యంగా వచ్చారు. దీంతో వారిని పరిశీలకులుగా తొలగించినట్టు మీనాక్షి ప్రకటించారు. మొత్తం 70 మంది పరిశీలకులకు ఆహ్వానం అందగా హాజరుకాని వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని సూచించిన ఆమె, 2017 నుంచి పార్టీలో ఉన్న వాళ్లకే కమిటీలో చోటు ఉండేలా […]

కశ్మీర్‌ లోయ షట్‌డౌన్‌.. 35 ఏండ్లలో ఇదే తొలిసారి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని పార్టీలు, కుల, మత, వర్గ రహితంగా అందరూ తీవ్రంగా ఖండించారు. 35 ఏండ్ల తర్వాత తొలిసారిగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా కశ్మీర్‌ లోయలో బుధవారం బంద్‌ పాటించారు. లోయ అంతటా పలు చోట్ల శాంతి ప్రదర్శనలు జరిపారు. దేశ ఐక్యత, శాంతిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలని ప్రముఖ ముస్లింలతో కూడిన పౌర సమాజ గ్రూప్‌ పిలుపునిచ్చింది. అమాయకులను చంపడాన్ని ఇస్లాం ఎంతమాత్రం అంగీకరించదని, ఉగ్రవాదుల క్రూరత్వానికి అమాయక టూరిస్టులు బలవ్వడాన్ని తాము తీవ్రంగా […]

కశ్మీర్‌ను వీడుతున్న పర్యాటకులు

పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పర్యాటకులు కశ్మీరు నుంచి వెళ్లిపోతున్నారు. వీరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జమ్ముకశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పందిస్తూ, పర్యాటకులు వెళ్లిపోతుండటం కలచివేస్తున్నదని, కశ్మీరు లోయ నుంచి అతిథులు వెళ్లిపోవడానికిగల కారణాలను తాము పూర్తిగా అర్థం చేసుకోగలమని తెలిపారు. శ్రీనగర్‌ నుంచి కేవలం 6 గంటల్లో, 20 విమానాల్లో 3,337 మంది పర్యాటకులు వెళ్లిపోయారు. వీరంతా బుధవారం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల […]

మతం పేరుతో ప్రాణాలు తీస్తారా..?

పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన భయంకరమైన దాడి గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. మతం పేరుతో అమాయ ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం, వాళ్లను చంపడం అనేది హేయమైన చర్య. ఇలాంటి క్రూరమైన చర్యలను ఏ సిద్ధాంతమూ అంగీకరించదు. ఇది ఏరకమైన యుద్ధం? మనుషుల ప్రాణాలకు ఎలాంటి విలువ లేకుండా పోతోంది. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల్లో నిండిన విషాదం.. వాళ్లు పడుతున్న బాధను నేను ఊహించలేకపోతున్నాను’ అని ఎక్స్ వేదికగా సిరాజ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON