కోల్కతాలోని ప్రసిద్ధ కాళీఘాట్ ఆలయ నిర్వహణ మరియు ఆస్తులపై తీవ్ర కలకలం రేగింది. ఆలయంలోని ఓ
అత్యంత కీలకమైన లాకర్ తాళం చెవి గత 1980 నుంచి కనిపించడం లేదని ఆలయ నిర్మాతల వారసుడు దేబర్షి రాయ్ చౌదరి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. సSBI ఆలయ లాకర్లలోని పురాతన బంగారు ఆభరణాలు, దస్తావేజుల పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.