2026 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రస్థాయి పురస్కారాలకు 123 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులను పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేసింది. శనివారం(సెప్టెంబర్ 5) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొడంగల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిసింది. మొత్తం 52 మంది ఉపాధ్యాయులకు, 11 మంది జూనియర్ లెక్చరర్లకు, ముగ్గురు పాలిటెక్నిక్ అధ్యాపకులకు అవార్డులను ప్రకటించారు