స్పెయిన్ సమీపంలోని అట్లాంటిక్ మాహా సముద్రంలో ఉన్న కేనరీ ఐలాండ్స్ వద్ద ఘోర పడవ ప్రమాదం జరిగింది. వెస్ట్ ఆఫ్రికా నుంచి వస్తున్న వలస కార్మికుల పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దాదాపు 83 మంది కార్మికులు మృతి చెందినట్లు మైగ్రాంట్ రైట్స్ వ్యవస్థాపకుడు హెలీనా మలేనో తెలిపారు. మా ఫుడ్, వాటర్ సరఫరా పూర్తిగా అయిపోయింది. దాంతో మాకు బలవంతంగా సముద్రం నీళ్లు తాగిపించారు. ఈ జర్నీలో మార్గ మధ్యలో చనిపోయిన వారిని సముద్రంలోకి విసిరేశారని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.