కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను హనీ ట్రాప్ చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు . స్నేహితుల ద్వారా పరిచయమైన ఒక యువతితో తామిద్దరం కలిసి పలు ఆలయాలను కూడా సందర్శించామని , యువతి తనను పెళ్లి చేసుకోవాలని, లేనిపక్షంలో రూ. 5 కోట్లు ఇవ్వాలని సదరు కుటుంబం ఒత్తిడి తెస్తోందని వారి వద్ద ఉన్న వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లతో వేధిస్తున్నారని భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.