కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ హనీ ట్రాప్ కేసులో భగీరథ్ ఆరోపణలకు భిన్నంగా సదరు యువతి కుటుంబం హైదరాబాద్లో ఫిర్యాదు చేసింది. ఆ యువతి మైనర్ అని భగీరథ్ ఆమెను ఇబ్బందులకు గురిచేశాడని వారు ఆరోపిస్తున్నారు. ఒకవేళ బాధితురాలు మైనర్ అని తేలితే ఈ కేసు పోక్సో చట్టం కిందకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భగీరథ్ ఫిర్యాదుపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేయగా.. యువతి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

