ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేత అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా తాజాగా ధృవీకరించింది. కొన్ని గంటల పాటు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు ప్రభుత్వ సంతాప దినాలను ప్రకటిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఏడు రోజుల పాటు జాతీయ సెలవు దినాలను ఇస్తున్నట్లు స్పష్టం చేసింది

