జనసేన పార్టీ కార్యాలయంలో నేడు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ముఖ్యమంత్రి అవ్వడంపై ఆయన స్పందించారు. “పక్కరాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టి గెలవగానే నాతో పోల్చుతున్నారు. 2019లో రెండు చోట్లా నన్ను ఓడించారు. తమిళనాడు పరిస్థితులు వేరు. ఏపీ పరిస్థితులు వేరు. అందరూ నన్ను వదిలేసినా ఒంటరిగా పార్టీని ముందుకు తీసుకెళ్లాను. ఊళ్లో పెళ్లికి కుక్కలు హడావిడి చేసినట్లుగా ఉంది. దయచేసి ఆ పార్టీతో పోల్చొద్దు..” అంటూ వ్యాఖ్యానించారు.

