ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు అక్కడి తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. సీఎం అందరినీ పలకరించి వారితో ఫొటోలు దిగారు. పర్యటనలో భాగంగా ప్రపంచ నగరాల సదస్సు (వరల్డ్ సిటీస్ సమిట్)లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు.