ఆదివారం ఎడ్జ్బస్టన్ వేదికగా జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టాస్ కోసం మైదానంలోకి వచ్చిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో చేతులు కలపలేదు. దీంతో ‘నో హ్యాండ్ షేక్’ విధానం మరోసారి చర్చనీయాంశమైంది. సాధారణంగా టాస్ అనంతరం ప్రత్యర్థి కెప్టెన్లు ఒకరితో ఒకరు చేతులు కలుపుతారు. కానీ ఈ మ్యాచ్ అలాంటి దృశ్యం కనిపించలేదు. ఇద్దరు కెప్టెన్లు మర్యాదపూర్వకంగా పలకరించుకున్నప్పటికీ, చేతులు మాత్రం కలపలేదు.