దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాలో సంభవించిన భారీ భూకంపాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ఘాఢ సంతాపం తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో భారతదేశం వెనిజులాకు అండగా ఉంటుందని, దేశ పునర్నిర్మాణానికి, బాధితుల రక్షణకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.