విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేసారు. పలు రంగాల్లో కీలకమైన ప్రాజెక్టుల ద్వారా రూ. 9.50 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించేలా విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు రూపకల్పనకు నిర్ణయించారు. సూక్ష్మ స్థాయి ప్రణాళిక ద్వారా విశాఖ రీజియన్ మొత్తం అభివృద్ధి చేయాలి అనదే వీఈఆర్ ప్రాజెక్టు లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేసారు. వీఈఆర్ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని… ప్రతి రంగాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.