తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి జోసెఫ్ విజయ్ తన మొదటి అధికారిక ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మేకెదాటు డ్యామ్ ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో మేకేదాటు నిర్మాణం కోసం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం భూమిపూజకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో విజయ్ స్పందించారు.

