వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముమ్మళ్ల పల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 44 పై ఆగి ఉన్న బొలెరోను వెనక నుండి లారీ అతివేగంగా ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. ఘటనా స్థలంలో ముగ్గురు దుర్మరణం చెందగా గాయపడడంతో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.