NEET UG పరీక్షా నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2027 విద్యా సంవత్సరం నుండి నీట్ పరీక్షను ఆఫ్లైన్ (పెన్-పేపర్) విధానం నుండి పూర్తిగా ఆన్లైన్ (CBT – Computer Based Test) విధానానికి మార్చనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించేందుకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన నివాసంలో ఒక కీలక భేటీ నిర్వహించారు.